ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్ ప్రాసెసింగ్ రుసుము, ధ్రువపత్రాల పరిశీలన గడువును పొడిగిస్తూ కన్వీనర్ ఎం.ఎం.నాయక్ అక్టోబరు 27న ఉత్తర్వులు జారీ చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 27తో గడువు ముగియగా దీన్ని నవంబరు 3 వరకు పొడిగించారు. కళాశాలలు, కోర్సులు, ఐచ్ఛికాల ఎంపికకు నవంబరు రెండు లేదా మూడో వారంలో అవకాశం కల్పించనున్నారు. ఇప్పటివరకు ప్రాసెసింగ్ రుసుము చెల్లించిన 82840 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.