• facebook
  • whatsapp
  • telegram

డిసెంబరు 1నుంచి డిగ్రీ ఫస్టియర్‌, బీటెక్‌ తరగతులు 

* మిగతా వారికి నవంబరు 2 నుంచి


ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, వృత్తి విద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరగతుల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. డిగ్రీ, బీటెక్‌, బీ ఫార్మసీ మొదటి ఏడాది తరగతులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారానికి ఆరు రోజులు తరగతులు నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఒకరోజు సెలవు ఇస్తే రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహించాలని సూచించింది. జాతీయ సెలవులు, పండుగ రోజులు మినహా ఇతర సమయాల్లో దీన్ని అమలు చేయాలంది. విద్యాసంస్థల్లో కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని ఆదేశించింది. 1/3 మందికి 10 రోజుల చొప్పున తరగతులు నిర్వహించనున్నారు. 90 రోజుల్లో 30 రోజుల పాటు తరగతి బోధన, మిగతా సమయం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. తరగతి 45 నిమిషాలు, 5-10 నిమిషాల తర్వాత మరో తరగతి ఉంటాయి.
డిగ్రీ వారికి తరగతులు..
* 2, 3 సంవత్సరాల వారికి నవంబరు 2 నుంచి డిగ్రీ కళాశాలలు ప్రారంభం
* సెమిస్టర్‌-3, 5 వారికి అంతర్గత పరీక్షలు: డిసెంబరు 1-5
* వచ్చే ఏడాది మార్చి 6న విద్యా సంస్థలకు సెలవు
* సెమిస్టర్‌ పరీక్షలు: మార్చి 8 నుంచి
* సెమిస్టర్‌-4, 6 వారికి తరగతులు: మార్చి 25 నుంచి
* అంతర్గత పరీక్షలు: జూన్‌ 1-5
* సెమిస్టర్‌ పరీక్షలు: ఆగస్టు 9 నుంచి బీటెక్‌, బీఫార్మసీ వారికి తరగతులు
* సెమిస్టర్‌-3, 5, 7 వారికి తరగతులు: నవంబరు 2న
* అంతర్గత పరీక్షలు: డిసెంబరు 1-5
* వచ్చే ఏడాది మార్చి 6న విద్యాసంస్థలకు సెలవు
* సెమిస్టర్‌ పరీక్షలు: మార్చి 8 నుంచి
* సెమిస్టర్‌-4, 6, 8 వారికి తరగతులు: మార్చి 25 నుంచి
* అంతర్గత పరీక్షలు: జూన్‌ 1-5
* ఆగస్టు 7న విద్యాసంస్థలకు సెలవు
* సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 9 నుంచి

పీజీ పునఃప్రారంభం..
* పీజీ సెమిస్టర్‌-3 వారికి తరగతులు ప్రారంభం: నవంబరు 2
* అంతర్గత పరీక్షలు: డిసెంబరు1-5
* వచ్చే ఏడాది మార్చి 6న సెలవు
* సెమిస్టర్‌ పరీక్షలు: మార్చి 8 నుంచి
* సెమిస్టర్‌-4 తరగతులు: మార్చి 25న
* అంతర్గత పరీక్షలు: జూన్‌1-5
* సెమిస్టర్‌-4 పరీక్షలు: ఆగస్టు 9 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.