జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు నవంబరు 12 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయవర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, సర్టిఫికేట్ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఈ తేదీని పొడిగించామన్నారు. విద్యార్హతలు, రుసుం, తదితర వివరాలను www.braouonline.in లో పొందుపర్చినట్లు తెలిపారు. ఇంటర్, నేషనల్ ఓపెన్స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తిచేసిన వారు, విశ్వవిద్యాలయం నిర్వహించిన అర్హత పరీక్షలలో 2016 నుంచి 2020 వరకు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సైతం నేరుగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333/555లో సంప్రదించవచ్చన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.