‣ ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
‣ ఈ తరహా న్యాయవిద్య డిగ్రీ కళాశాలలు దేశంలోనే ప్రథమం: లాసెట్కన్వీనర్
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా గురుకుల డిగ్రీ కళాశాలల్లో న్యాయ విద్య అందించే ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రంలో అంకురార్పణ జరగనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ బార్కౌన్సిల్ఆఫ్ఇండియా(బీసీఐ)కు ఇటీవల దరఖాస్తు చేసింది. హైదరాబాద్శివారు ఘట్కేసర్సమీపంలోని ఎస్సీ బాలికల డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలోని ఎస్టీ బాలుర డిగ్రీ కళాశాలలో ఆ కోర్సును ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రతిపాదించారు. ఘట్కేసర్కళాశాలను ఇటీవలే బీసీఐ అధికారులు తనిఖీ చేసి అనుమతి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేశారని లాసెట్కన్వీనర్ఆచార్య జీబీ రెడ్డి నవంబరు 6నవెల్లడించారు. సంగారెడ్డి కళాశాలను బీసీఐ తనిఖీ చేయాల్సి ఉందన్నారు. వాటిల్లో బీఏ-ఎల్ఎల్బీ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెడతారని, ఒక్కో దాంట్లో 120 సీట్లు(రెండు సెక్షన్లు) చొప్పున అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. లాసెట్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కౌన్సెలింగ్ద్వారా ఇక్కడ సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. ‘జాతీయ, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్విశ్వవిద్యాలయాల్లో రెసిడెన్షియల్తరహాలో న్యాయ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో గురుకుల తరహా న్యాయ విద్య అందించడం ఇదే తొలిసారి. ఆ ఘనత రాష్ట్రానికి దక్కుతుంది’ అని జీబీ రెడ్డి చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.