గొడుగుపేట(మచిలీపట్నం),న్యూస్టుడే: జిల్లాలోని యువతకు కేడీసీసీ బ్యాంకులో గౌరవవేతనంతో కూడిన ఇంటర్న్షిప్ కల్పించేందుకు నిర్ణయించినట్లు బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో జిల్లాలో ఉపాధి అవకాశాలు మందగించడంతో డిగ్రీ, పీజీ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతకు బ్యాంకింగ్ రంగంలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా కేడీసీసీబ్యాంకుకు అనుబంధంగా ఉన్న 58 బ్రాంచిల్లో ఒక్కో బ్రాంచికి ఒకరు చొప్పున, కేంద్ర, ప్రాంతీయ కార్యాలయాల్లో 10మంది చొప్పున ఆరునెలలపాటు తర్ఫీదు ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణ యువత ఏదైనా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లే సమయంలో ఉద్యోగ అనుభవం కింద ఉపయోగ పడుతుందని అన్నారు. బ్యాంకులో 70మంది స్టాఫ్ అసిస్టెంట్, 10 మంది అసిస్టెంట్ మేనేజర్లను నియమించాలని నిర్ణయించామని వీరి ఎంపిక ప్రక్రియ బాధ్యతను ముంబయిలోని ఇన్స్ట్యూట్ ఫర్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని, ఈలోపు యువతీ యువకులకు ఆరునెలల పాటు ఇంటర్న్షిప్ కల్పించాలని నిర్ణయించామన్నారు. అర్హత గల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.