గుంటూరు(జిల్లాపరిషత్తు), న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వ్యవసాయ బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో రైతు కోటా ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంగ్రూ రిజిస్ట్రార్ ఎన్.త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎంసెట్-2020లో అర్హత సాధించిన బైపీసీ అభ్యర్థులు వ్యవసాయ బీఎస్సీ(హానర్స్), బీటెక్(ఆహార సాంకేతికత), బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎస్సీ(మత్స్య), బీఎస్సీ ఉద్యాన(హానర్స్), బీటెక్(వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ)లో ఉమ్మడి ప్రవేశాల కోసం డిసెంబరు 2 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.angrau.ac.inని సంప్రదించాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.