వేంపల్లె, న్యూస్టుడే: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2020-21 ప్రవేశాల కోసం వంద మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. గణితం, సైన్సు పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది. ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ విద్య, గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో రెండు లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సులు చదువుకునేందుకు నవంబరు 28న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 638 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వెబ్సైట్ (http://rguktcet.in )లో హాల్టిక్కెట్లను, ఇతర వివరాలను ఉంచామని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.