గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్టుడే: అగ్రిసెట్ పరీక్షలు 2020 ఫలితాలను ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్రెడ్డి నవంబరు 26న విడుదల చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్కు 2,487 మంది పరీక్ష రాస్తే.. 2,433 మంది (97.80 శాతం) ఉత్తీర్ణులయ్యారు. విత్తన సాంకేతిక పాలిటెక్నిక్ కోర్సుకు 246 మంది పరీక్షకు హాజరవగా.. 242 మంది (98.40 శాతం), సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్కు 74 మంది పరీక్షలు రాస్తే.. 71 మంది (98.40 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరంతా వ్యవసాయ బీఎస్సీ (హానర్స్)లో సీట్ల కోసం ఆయా కేటగిరిల్లో అర్హత సాధించారు. విశ్వవిద్యాలయ వ్యవసాయ కళాశాలల్లో వ్యవసాయ పాలిటెక్నిక్ అభ్యర్థులకు 112 సీట్లు, వర్శిటీ అనుబంధ ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో 72 సీట్లు కలిపి 184 సీట్లు ఉన్నాయి. వ్యవసాయ పాలిటెక్నిక్ అభ్యర్థులకు 159 సీట్లు, విత్తన సాంకేతికత పాలిటెక్నిక్ అభ్యర్థులకు 21 సీట్లు, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ అభ్యర్థులకు 4 సీట్లను కేటాయిస్తామని వీసీ తెలిపారు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.