ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యాశాఖ మరోసారి అవకాశం కల్పించింది. డిసెంబరు 17న రిజిస్ట్రేషన్ చేసుకొని, అదే రోజు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. వారికి డిసెంబరు 18న సీట్లు కేటాయిస్తామన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక విడతలో సీట్లు వచ్చినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారు, చేసినా కళాశాలలో చేరని వారు డిసెంబరు 16, 17వ తేదీల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మిగిలిపోయిన సీట్ల భర్తీకి డిసెంబరు 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.