• facebook
  • whatsapp
  • telegram

Education : అమ్మాయి చదువు ఇంటికి వెలుగు

* పదిలో 492 మార్కులు సాధించిన విద్యార్థిని

* ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై, న్యూస్‌టుడే: ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు.   ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా కోరడాచ్చేరి ప్రభుత్వ బాలిక మహోన్నత పాఠశాలలో బాలా-సుధా దంపతుల కుమార్తె దుర్గాదేవి 10వ తరగతిలో 500కు గాను 492 మార్కులు సాధించి.. పాఠశాలలో మొదటిస్థానం, జిల్లా స్థాయిలో రెండోస్థానంలో నిలిచింది. తండ్రి మెకానిక్‌. దుర్గాదేవి మాట్లాడుతూ.. విద్యుత్‌ సౌకర్యం లేకుండా ఏళ్లుగా తాము గుడిసెలో ఉంటున్నామని తెలిపింది. ఛార్జింగ్‌ లైట్, కొవ్వొత్తి వెలుగులోనే చదివానని పేర్కొంది. గతంలో విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్నా.. బిల్లు కట్టే స్తోమత లేకపోవడంతో చాలా ఏళ్ల కిందటే తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కనెక్షన్‌ ఇవ్వాలని ఇటీవల ఆమె ప్రభుత్వానికి విన్నవించింది. విషయం తెలుసుకున్న తిరువారూర్‌ ఎమ్మెల్యే పూండి కలైవానన్, విద్యుత్‌ అధికారులు.. నేరుగా విద్యార్థిని ఇంటికి వెళ్లి పరిశీలించారు. మూడు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి కనెక్షన్‌ ఇచ్చారు. వైద్యురాలు కావడమే తన లక్ష్యమని దుర్గాదేవి పేర్కొన్నారు.

Updated Date : 19-05-2024 13:24:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం