* హెచ్సీయూకు రూ.150 కోట్లు మంజూరుకు అవకాశం
* ఆపరేషన్ డిజిటల్ బోర్డుకు రూ.కోటి మాత్రమే ఖర్చు
* కేంద్ర బడ్జెట్లో ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బడులను నాణ్యమైన విద్య అందించేలా పటిష్ఠం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఆ ప్రకారం తెలంగాణలో 300-325 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. శ్రేష్ఠతర విద్యాసంస్థలు(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్..ఐఓఈ)కు కేటాయించిన నిధుల్లో హెచ్సీయూకు 2021-22లో రూ.150-200 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య అప్పారావు పొదిలె చెప్పారు. వీటితోపాటు ఏపీ, తెలంగాణ గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.53.80 కోట్లు కేటాయించారు. ఐఐటీ హైదరాబాద్కు విదేశీ రుణం(ఈఏపీ) కింద రూ.150 కోట్లు అందనున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటయ్యే పక్షంలో రాష్ట్రంలో ఒకట్రెండు ఏర్పాటు కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని ఐదు లక్షల తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు కేంద్రం 2019-20లో ఆపరేషన్ డిజిటల్ బోర్డు పథకాన్ని ప్రకటించింది. గత బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించి చివరకు రూ.కోటి మాత్రమే ఖర్చు చేసింది. తాజా బడ్జెట్లో దీనికి రూ.కోటి కేటాయించడాన్ని బట్టి ఆ పథకానికి తిలోదకాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.