• facebook
  • whatsapp
  • telegram

తొలి విడ‌త‌ జేఈఈ మెయిన్‌కు 6.61 లక్షల మంది

* తెలుగులో రాసేది 371 మందే
* ఈసారి నాలుగు విడ‌త‌ల్లో ప‌రీక్ష‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 26వ తేదీ వరకు జరిగే తొలి విడత జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు దాదాపు 6.61 లక్షలమంది పోటీపడుతున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచే 1.61 లక్షల మందికిపైగా ఉన్నారు. అంటే 24.41 శాతం మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులే. ఈసారి జేఈఈ మెయిన్‌ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నాలుగు విడతల్లో మొత్తం 21.75 లక్షలమంది దరఖాస్తు చేశారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2.64 లక్షలమంది దరఖాస్తు చేయగా ఆ తర్వాత 2.54 లక్షలతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటివరకు కేవలం 371 మందే తెలుగులో ప్రశ్నపత్రం కావాలని దరఖాస్తు చేశారు. ఫిబ్రవరిలో పరీక్షకు ఏపీ నుంచి 87,797 మంది, తెలంగాణ నుంచి 73,782 మంది  దరఖాస్తు పెట్టుకున్నారు.
మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు..
ఒకేసారి నాలుగుసార్లకు కలిపి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో కొందరు రెండు, మూడు, నాలుగుసార్లుకు రుసుం చెల్లించారు. ఫిబ్రవరి పరీక్ష తర్వాత మళ్లీ మార్చి పరీక్ష రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు అప్పుడూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు ఆసక్తి లేకుంటే మార్చి, ఏప్రిల్‌, మే పరీక్షలకు చెల్లించిన ఫీజు వెనక్కి తీసుకోవచ్చు. అందువల్ల ఇప్పటివరకు ఫిబ్రవరి పరీక్షకు మాత్రమే దరఖాస్తుల సంఖ్య 6,61,761గా చెప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.