ఈనాడు, అమరావతి: బయోమెడికల్ ఉత్పత్తి, నిర్వహణ ఇంజినీరింగ్లో 50 ఉద్యోగాలు ఉన్నాయని, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 7లోపు దరఖాస్తు చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఉత్పత్తి ఇంజినీరింగ్ ట్రైనీ ఉద్యోగానికి డిప్లొమా, బీటెక్(ఈసీఈ, ఈఐఈ), నిర్వహణ విభాగానికి డిప్లొమా, బీటెక్లో బయోమెడికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఈ సమయంలో రూ.10వేలు ఇస్తారని తెలిపారు. అనంతరం మెడ్టెక్ జోన్ ఉద్యోగంలోకి తీసుకుంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు టోల్ఫ్రీ నంబరు 18004252422లో సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.