నూజివీడు, న్యూస్టుడే: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ఐటీల్లో ఎన్సీసీ, సైనిక, క్రీడలు, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన 257 సీట్లు, ఎస్టీ కేటగిరీలో మిగిలిన 9 సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 07న నూజివీడు ట్రిపుల్ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కులపతి ఆచార్య కె.సి.రెడ్డి, ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు ప్రక్రియను పర్యవేక్షించారు. కోరుకున్న క్యాంపస్లో సీటు రాకపోవడంతో ప్రవేశం పొందిన కొందరు ఆయా ట్రిపుల్ ఐటీల్లో చేరలేదు. ఆ ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ ఎప్పుడు చేపట్టాలనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని గోపాలరాజు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.