• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నోట్స్‌ రాసేద్దాం... స్మార్ట్‌గా!

మార్కెట్‌లో డిజిటల్‌ పెన్‌లు

మామూలుగా పెన్‌తో పుస్తకంలో రాసుకోవడం అందరూ చేసేదే. కానీ నేటికాలపు స్మార్ట్‌ విద్యార్థుల కోసం ఇప్పుడు స్మార్ట్‌ పెన్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇదివరకే ఇవి పరిచయం  అయినా... ఇప్పుడు కొత్తకొత్త మోడల్స్, ఫీచర్స్‌తో విద్యార్థులకు ఉపయోగపడేలా అందుబాటులోకి వచ్చాయి. 

స్మార్ట్‌ పెన్‌లు విద్యార్థుల నోట్‌ మేకింగ్‌ ప్రక్రియను సులభతరం చేస్తాయి. మొబైల్‌ యాప్స్‌తో అనుసంధానమై పనిచేసే వీటికి ప్రత్యేకమైన పుస్తకాలు కూడా ఉంటాయి. మనం ఆ పుస్తకంలో ఈ పెన్‌తో రాస్తూ ఉండగానే ఆ వాక్యాలు మొబైల్‌ లేదా ట్యాబ్‌ తెరపై ప్రత్యక్షమవుతాయి. అంటే ఆ నోట్స్‌ మొత్తాన్ని పెన్నే డిజిటలైజ్‌ చేసేస్తుందన్నమాట. ఆ సాఫ్ట్‌ కాపీలను మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇమేజ్, టెక్ట్స్, పీడీఎఫ్‌ ఫార్మాట్‌లలో సేవ్‌ చేసుకోవచ్చు. కొన్ని పెన్నుల్లో ఇంటర్నల్‌ మెమరీ, ఆడియో స్పీకర్, కెమెరా సౌకర్యాలు కూడా ఉంటున్నాయి. వాటి ద్వారా కావాల్సిన మెటీరియల్‌ను సేవ్‌ చేసుకోవడం, ఫొటోలు తీసుకోవడం వంటివి చేయొచ్చు. పాఠం వింటున్నప్పుడు ఒకేసారి రాసుకుంటూ ఆడియో రికార్డ్‌ చేసుకునే సౌలభ్యమూ ఉంది. 

అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారవుతూ స్టైలిష్‌ లుక్‌లో కనిపించే ఈ పెన్‌లకు అవసరమైతే టిప్‌ను మార్చుకోవచ్చు. ఛార్జింగ్‌తో నడిచే వీటిలో.. లైవ్‌స్క్రైబ్‌ సింఫనీ, నియోస్మార్ట్‌పెన్, మోల్‌స్కైన్‌ వంటి మోడల్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిపోతుందా మీ సామర్థ్యం!

‣ పదితో.. త్వరగా స్థిరపడదాం!

‣ పరీక్షల సమయం ఫోనుకు విరామం!

‣ ఐఐఎఫ్‌టీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ

‣ బీఐఎస్‌లోకి స్వాగతం

‣ ఒత్తిడి నివారణకు ఇన్‌స్టా గైడ్‌

‣ సరిపడా నీరు చదువుకూ మేలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌