• facebook
  • twitter
  • whatsapp
  • telegram

12 వేలకు పైగా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు 

చదువుకుంటూనే సంపాదించొచ్చు. ఇంట్లో నుంచే ఉద్యోగానుభవాన్ని పొందొచ్చు. ఇదంతా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లతో సాధ్యమవుతుంది. 

గత రెండేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంటర్న్‌షిప్‌లకు ప్రాముఖ్యం పెరిగింది. దీంట్లో భాగంగా నియామక, శిక్షణల వేదిక ‘ఇంటర్న్‌శాల’ చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. ఒకపక్క చదువుకుంటూనే ఇంటి నుంచి పని అనుభవాన్ని సంపాదించేలా విద్యార్థుల కోసం ‘చలో ఇండియా.. లెట్స్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో 12,000కు పైగా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం లభిస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మే 8 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 

ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, డిజైన్, మీడియా, కామర్స్‌ విభాగాలకు చెందిన విద్యార్థులేకాకుండా.. నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులెవరైనా దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైన విద్యార్థులకు స్టైపెండ్‌ ఉంటుంది. అత్యధికంగా నెలకు రూ.25,000 వరకు స్టైపెండ్‌ పొందొచ్చు. 

కంటెంట్‌ రైటింగ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, వెబ్‌ అండ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ అకౌంటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, గ్రాఫిక్‌ డిజైన్, యూఐ/యూఎక్స్‌ డిజైన్, వీడియో మేకింగ్‌ అండ్‌ ఎడిటింగ్, హ్యూమన్‌ రిసోర్సెస్‌... మొదలైన విభాగాల్లో ఈ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు

వెబ్‌సైట్‌: https://internshala.com/work-from-home
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిప్లొమాల్లోకి పాలీసెట్‌ దారి

‣ జాగ్రఫీ కోణంలో వర్తమాన అంశాలు

‣ ఐఐఎంలో ఐదేళ్ల ఎంబీఏ

‣ షిప్పింగ్‌ కోర్సుల్లో చేరతారా?

‣ గ్రూపు- 1, 2ల సన్నద్ధత... ఏక కాలంలోనా? వేర్వేరుగానా?

‣ రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

‣ వాయిదాలు వద్దు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌