• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!

నిక్మార్‌లో పీజీ కోర్సులకు ప్రవేశ ప్రకటన

దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న వాటిలో నిర్మాణ రంగం ముఖ్యమైంది. ఇప్పుడిది శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో సేవలందించడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా సుశిక్షితులైన మానవ వనరులను రూపొందించడానికి దేశంలో పలు సంస్థలు వెలిశాయి. వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మార్‌) ముఖ్యమైంది. ఈ సంస్థ హైదరాబాద్‌ క్యాంపస్‌లో పలు కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు! 

నిక్మార్‌ హైదరాబాద్‌ (షామీర్‌పేట) క్యాంపస్‌లో రెండేళ్లు, ఏడాది వ్యవధితో పలు రకాల రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నారు. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. అకడమిక్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు టాప్‌ ర్యాంకర్‌ స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. పది, ఇంటర్‌/ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో 95 శాతం మార్కులకు 80 శాతం ఫీజు రాయితీ ఉంటుంది. 90 శాతం మార్కులుంటే 60 శాతం, 85 శాతం మార్కులుంటే 40 శాతం ఫీజు మినహాయిస్తారు.

ఇవీ కోర్సులు 

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌ ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ప్రొజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

వ్యవధి: రెండేళ్లు

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సస్టైనబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ 

వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ 

వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్, ఆర్ట్స్, అగ్రికల్చర్‌... వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవధి: ఏడాది

అర్హత: ఏదైనా ఇంజినీరింగ్‌ విభాగంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ హెల్త్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవధి: ఏడాది

అర్హత: 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో బీఎస్సీ (ఫిజిక్స్‌/కెమిస్ట్రీ)తోపాటు సంబంధిత విభాగంలో ఏడాది పని అనుభవం.

ప్రవేశ పరీక్ష ఎలా?

నిక్మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఎన్‌క్యాట్‌) 180 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ 72, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ 36, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ 72 మార్కులకు ఉంటాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి జీడీ, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌కు 20, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30, అప్లికేషన్‌ రేటింగ్‌ (అకడమిక్‌ ప్రతిభ, పని అనుభవం)కు 70 మార్కులు కేటాయించారు. మొత్తం 300 మార్కులకు గానూ చూపిన ప్రతిభ ప్రకారం ప్రవేశాలు లభిస్తాయి.  

ఉపాధి అవకాశాలు...

నిక్మార్‌లో విద్య అభ్యసించినవారు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ స్థిరాస్తి, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. లోథా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్‌ బిల్డింగ్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్, యునీటెక్, టాటా హౌసింగ్, అన్సాల్‌ ఏపీఐ, రహేజా యూనివర్సల్, లార్సెన్‌ అండ్‌ టబ్రో, పంజ్‌ లాయిడ్‌ గ్రూప్, 99 యాకర్స్, మ్యాజిక్‌ బ్రిక్స్, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్‌.కామ్‌.. తదితర సంస్థల్లో అవకాశాలుంటాయి. సిమెంట్‌ పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్స్, విదేశీ నిర్మాణ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 1

ఫీజు: రూ.2100

వెబ్‌సైట్‌: https://www.nicmar.ac.in/hyderabad
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

Posted Date : 01-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌