ఈనాడు, హైదరాబాద్: విద్యార్థులు పరీక్షల భయాన్ని, ఒత్తిడిని తట్టుకొని వార్షిక పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా ఉచితంగా స్టడీ మెటీరియల్ను వారికి అందుబాటులో ఉంచుతున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అక్టోబరు 25 నుంచి జరిగే పరీక్షలకు 70 శాతం సిలబస్తోపాటు 50 శాతం ఛాయిస్ ఉంటుందన్నారు. జంతు, వృక్ష, భౌతిక శాస్త్రాలు, గణితం, చరిత్ర సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ను అక్టోబరు 12 నుంచే ఇంటర్బోర్డు వెబ్సైట్లో ఉంచుతున్నామన్నారు. మిగిలినవి రెండు మూడు రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్, నిపుణులు ఉచిత్యాల రమణ, మహేందర్ కుమార్, వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.
జానియర్ ఇంటర్ స్టడీ మెటీరీయల్
తెలుగు మీడియం | ఇంగ్లిష్ మీడియం |
‣ గణితం 1బి | ‣ ఎకనామిక్స్ |
‣ భౌతికశాస్త్రం | ‣ ఫిజిక్స్ |
‣ వృక్షశాస్త్రం | ‣ హిస్టరీ |
‣ జంతుశాస్త్రం | ‣ వృక్షశాస్త్రం |
‣ చరిత్ర | ‣ జంతుశాస్త్రం |
‣ ఎకనామిక్స్ | ‣ రసాయనశాస్త్రం |
‣ పొలిటికల్ సైన్స్ | |
‣ రసాయనశాస్త్రం | |
‣ కామర్స్ |
************************************************************************
మరింత సమాచారం ... మీ కోసం!