* జూన్ 1 నుంచి తరగతులు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల తేదీలను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర జూనియర్ కళాశాలలకు సంబంధించి మే 9 నుంచి మే 31 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు విద్యార్థుల పదో తరగతి గ్రేడు, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయించనున్నారు.