• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 8,773 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు 

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు....

పోస్టులు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)

రాష్ట్రాల వారీగా ఖాళీలు:

1. ఉత్తర్‌ ప్రదేశ్- 1781

2. ఆంధ్రప్రదేశ్- 50

3. మధ్యప్రదేశ్- 288

4. రాజస్థాన్- 940

5. దిల్లీ- 437

6. ఉత్తరాఖండ్- 215

7. ఛత్తీస్‌గఢ్- 212

8. తెలంగాణ- 525

9. అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు- 20

10. హిమాచల్ ప్రదేశ్- 180

11. హరియాణా- 267

12. జమ్ము అండ్‌ కశ్మీర్- 88

13. ఒడిశా- 72

14. పంజాబ్- 180

15. సిక్కిం- 04

16. తమిళనాడు- 171

17. పుదుచ్చేరి- 04

18. పశ్చిమ్‌ బెంగాల్- 114

19. కేరళ- 47

20. లక్షద్వీప్- 03

21. మహారాష్ట్ర- 100

22. అసోం- 430

23. అరుణాచల్ ప్రదేశ్- 69

24. మణిపూర్- 26

25. మేఘాలయ- 77

26. మిజోరం- 17

27. నాగాలాండ్- 40

28. త్రిపుర- 26

29. గుజరాత్- 820

30. కర్ణాటక- 450

31. లడఖ్- 50

32. బిహార్- 415

33. ఝార్ఖండ్- 165

మొత్తం పోస్టుల సంఖ్య:8,773 . 

హైదరాబాద్‌ సర్కిల్‌(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525.

అమరావతి సర్కిల్‌(ఆంధ్రప్రదేశ్‌)లో పోస్టుల సంఖ్య: 50.

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 01.04.2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1995 - 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

బేసిక్‌ పే: నెలకు రూ.19,900.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. 

ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు జరుగుతుంది.  పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు. 

మెయిన్‌ ఎగ్జామ్‌: మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు... 50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు... 40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు... 50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు... 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.12.2023.

ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024లో జరుగుతుంది. 

మెయిన్‌ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో జరుగుతుంది.

=========================================
 


SBI CLERKS STUDY METERIAL

 Reasoning & Computer Aptitude ‣ Quantitative Aptitude
‣ General and Banking Awareness  English Language
 PREVIOUS PAPERS  MODEL PAPERS


మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 18-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :