• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 ఏడాదికి గాను అర్హులైన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పైచదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు ఉపకార వేతనాన్ని ఇస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు భత్యం అందుతుంది.

వివరాలు...

ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 2023-24

అర్హతలు: పదో తగరగతి పూర్తి చేసి గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు. వీటిని ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే అందిస్తారు. అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. భారతదేశంలో చ‌దివే పిల్లలకే ఈ స్కాల‌ర్‌షిప్‌ వ‌ర్తిస్తుంది. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, ఎంపిక బాధ్యత రాష్ట్రాల‌పైనే ఉంటుంది. విద్యార్థులు ప్రవేశం పొందే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.

దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

మరింత సమాచారం... మీ కోసం!

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 

నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

డాక్టర్ వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు

ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 29-08-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :