‣ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది.. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తదితరులతో ఏప్రిల్ 15న నిర్వహించిన సమావేశమై చర్చించారు. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఇప్పటిదాకా ర్యాంకు నిర్ణయించేవారు. ఈసారికి ఆ వెయిటేజీ ఉండదు. ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. కేవలం ఎంసెట్లో 160కి వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారు.