* 9వ తరగతికి 6 పేపర్ల విధానంతో నిర్వహణకు ఆదేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 20వ తేదీ నుంచి సమ్మెటివ్ పరీక్షలు-2 ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్ మార్చి 31న విడుదల చేశారు. ఏప్రిల్ 20, 24, 25 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 3, 4, 5 తరగతులకు పర్యావరణ శాస్త్రం పరీక్ష 26వ తేదీన ఉంటుంది. 6, 8వ తరగతుల విద్యార్థులకు 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయి. 7, 9వ తరగతి విద్యార్థులకు 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో మధ్యాహ్నాం 1 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లే 9వ తరగతికి కూడా 6 పేపర్ల విధానంలో నిర్వహించాలని అధికారుల్ని కమిషనర్ ఆదేశించారు.
మోడల్ పేపర్లు
‣ ఎనిమిదో తరగతి మోడల్ పేపర్లు
‣ తొమ్మిదో తరగతి మోడల్ పేపర్లు
మరింత సమాచారం... మీ కోసం!
‣ పాత ప్రశ్నపత్రాలు... ఎందుకు ముఖ్యం?
‣ భారతీయ కోర్సులకు టాప్ ర్యాంకులు
‣ కొయ్యగుజ్జు అడవులతో.. మంచుపొరల ఎడారులతో!
‣ సైబర్ సెక్యూరిటీలో ఏ కోర్సులు?ఎలాంటి ఉద్యోగాలు?
‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!
‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.