ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 అధ్యాపకుల ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 7న నోటిఫికేషన్ జారీ చేసింది. 19 సబ్జెక్టుల్లో అధ్యాపకులను నియమించనున్నారు. అర్హులైన అధ్యాపకులు డిసెంబరు 14వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గత జులై 23న జీవో జారీ చేసింది. ఆనాడు 247 అధ్యాపక ఖాళీలతోపాటు 14 జూనియర్ ఇన్స్ట్రక్టర్లు, 31 లైబ్రేరియన్, 37 ఫిజికల్ డైరెక్టర్, 25 ఎలక్ట్రీషియన్, అయిదు మ్యాట్రన్ల కొలువును భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. అంటే ఇంకా 112 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పవర్ గ్రిడ్లో కొలువు కావాలా?
‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.