ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్-2024’ని మే 24వ తేదీన నిర్వహించనున్నారు. గతంలో మే 17న పరీక్ష ఉండగా దాన్ని తాజాగా మార్చారు. ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు గడువు ఏప్రిల్ 22 వరకు ఉండగా దానిని 28వ తేదీకి పొడిగించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి సూచించింది. వచ్చే ఏప్రిల్ 24న పరీక్షలు నిర్వహించి, పది రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.