• facebook
  • whatsapp
  • telegram

SSC MTS Recruitment: ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్‌

* పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ 2024-25 ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం మే 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం జూన్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. జులై- ఆగస్టు నెలలో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌), హవల్దార్(గ్రూప్‌-సి నాన్‌-గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీకానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. గతేడాది 1,558 ఖాళీలు భర్తీ అయిన విషయం తెలిసిందే. ఎంటీఎస్‌ ఖాళీలను సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా; హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 

వెబ్‌సైట్ 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.