న్యూస్టుడే - కరీంనగర్ కలెక్టరేట్: డిగ్రీ ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’(దోస్త్) విధానాన్ని పాటిస్తున్న విషయం విదితమే. దోస్త్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొదటి విడత ప్రారంభమైంది. మూడు విడతల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. చివరి విడత పూర్తయ్యాక తరగతులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటానికి ఈ దఫా ఉన్నత విద్యా శాఖ కొత్తగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు నయా పైసా ఖర్చు లేకుండానే చరవాణి ద్వారా సులభతరంగా దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
నమోదు ప్రక్రియ ఇలా..
*దోస్త్ వెబ్సైట్ https:///dost.cgg.gov.in లో నమోదు చేసుకోవచ్చు. లేదా గూగుల్ ప్లేస్టోర్ నుంచి దోస్త్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత విద్యార్థి చరవాణి నంబరు నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దీని ద్వారా యాప్ ఓపెన్ చేసుకోవచ్చు.
* విద్యార్థి పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి.
* అనంతరం ముఖ గుర్తింపునకు ఫొటో తీసుకునే వెసులుబాటు సైతం కల్పించారు. విద్యార్థి తన ఫొటోను నావిగేట్ చేస్తున్నప్పుడు దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
* రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది.
* కళాశాలలు, కోర్సులు, ఫీజుల వివరాలను తెలుసుకొని వెబ్ ఆప్షన్ ప్రారంభమైన రోజు పూరిస్తే సరిపోతుంది. ఈప్రక్రియ ముగిశాక సీట్లు అలాట్ అవుతాయి.
మరింత సమాచారం ... మీ కోసం!