• facebook
  • whatsapp
  • telegram

Applications: పాలిటెక్నిక్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ శిక్షణ సంస్థలో 2024-25 విద్యా సంవత్సరానికి సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి శారద శుక్రవారం తెలిపారు. అనాథ, పాక్షిక అనాథ బాలికలు, సంరక్షణ కేంద్రాలు, మహిళా సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న బాలికలు మాత్రమే ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. పాలిటెక్నిక్‌ అర్హత పరీక్ష రాయకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందన్నారు. హనుమకొండలోని బాలరక్షా భవన్‌లో మే 17లోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు 97017 62709, 63025 44415 సంప్రదించాలన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.