• facebook
  • whatsapp
  • telegram

JEE Mains Topper: జేఈఈ మెయిన్స్‌ ఆలిండియా టాపర్‌గా రైతు బిడ్డ

* రోజుకు పది గంటలకుపైగా చదివానన్న నీల్‌కృష్ణ
 

వాశిం: మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్‌ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని వాశిం జిల్లా బెల్ఖేడ్‌ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్‌కృష్ణ గజారే(19) జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో దేశంలోని ప్రథమ ర్యాంకు సాధించారు. ఈ పరీక్షల కోసం రోజుకు 10 గంటలకు పైనే చదివినట్లు ఆయన తెలిపారు. నీల్‌కృష్ణ క్రీడల్లో సైతం రాణిస్తున్నాడని, విలువిద్యలో జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాడని ఆయన తండ్రి నిర్మల్‌ గజారే తెలిపారు. ఐఐటీ బొంబాయిలో చదువుకుని, సైంటిస్ట్‌ కావడం తన లక్ష్యమని నీల్‌కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం అతను వచ్చే నెల జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.   

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.