• facebook
  • whatsapp
  • telegram

Latest News: 28-03-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. ఆ అయిదు పరీక్షలపై త్వ‌ర‌లో స్పష్టత!

ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన, వాయిదా పడిన అయిదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్‌ రద్దు చేయగా, రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి (డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షలు రద్దు కాగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

2. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు.. భౌతికశాస్త్రం ప్రశ్నకు 2 మార్కులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా మార్చి 27న‌ ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా ‘ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము?’ అని రాగా, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ డెక్లినేషన్‌?’ అని తప్పుగా ప్రచురితమైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

3. ఎంత‘కీ’ సరిపోని సమాధానాలు.. టీఎస్‌-సెట్‌పై అభ్యంతరాల వెల్లువ

తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14 నుంచి 17 వరకు నిర్వహించిన టీఎస్‌-సెట్‌లోని ప్రశ్నలకు, ‘కీ’లోని సమాధానాలకు పొంతన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ‘కీ’ను నిర్వాహకులు మార్చి 25న విడుదల చేశారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

4. ఎంపీహెచ్‌డబ్ల్యూ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ (మహిళ) శిక్షణ కోర్సు పరీక్షకు అభ్యర్థులు ఏప్రిల్‌ 13వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి మార్చి 27న‌ ఒక ప్రకటనలో తెలిపారు. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌  ...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

5. మూడేళ్లలో 75% మార్కులు ఉంటేనే పరిశోధనకు అర్హత

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2020 - 21 నుంచి ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలో నాలుగో ఏడాది పరిశోధన, ఆనర్స్‌ యూజీ కోర్సులను ఉన్నత విద్యామండలి తీసుకురానుంది. విద్యార్థులు మూడేళ్ల తర్వాత కావాలనుకుంటే బయటకు వెళ్లిపోవచ్చని, ఒకవేళ నాలుగో ఏడాది చదవాలనుకుంటే ఆనర్స్‌ డిగ్రీ చేయొచ్చని ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావు తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

6. ఇతర రాష్ట్రాలవారికి ఈడబ్ల్యూఎస్‌ కోటా!

బీఈడీలో నిబంధనలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లను సైతం ఇతర రాష్ట్రాల వారితో నింపేస్తున్నారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో ఈ కోర్సులో చేరే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. వీటిని స్పాట్‌ కోటాకు బదిలీ చేయడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను యాజమాన్యాలు చేర్చుకుంటున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.