• facebook
  • whatsapp
  • telegram

CBSE: ప్రాథమిక విద్యావిధానంలో నూతన మార్పులు

* ప్రకటించిన సీబీఎస్‌ఈ

ఈనాడు, అమరావతి: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక విద్యా విధానంలో సీబీఎస్‌ఈ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫౌండేషన్‌ స్టేజ్‌ (ఎన్‌సీఎఫ్‌ఎఫ్‌ఎస్‌)ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు సిలబస్‌తో పాటు ఇతర అంశాల్లోనూ మార్పులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం (2023 - 24) నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాల అంచనా, అభ్యాసన, విధానాలకు సంబంధించి ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రస్తుతం ప్రతి చిన్నారికి కంటిచూపు,   వినికిడి, ఇతర వైద్య పరీక్షలు చేస్తుండగా వీటితో పాటు ప్రవేశాల సమయంలోనే వారి ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న మందులు తదితర వివరాలను విద్యాసంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఆటలు ఆడుకునేందుకు సదుపాయాలు కల్పించాలి. ఈ తరగతులు గ్రౌండ్‌ లేదా మొదటి అంతస్తులో మాత్రమే ఉండాలని సీబీఎస్‌ఈ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. తగినంత వెలుతురు వచ్చే తరగతులు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, తరగతి గదుల్లో కాంక్రీట్‌ అంచులు గుండ్రగా ఉండాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ అయిదు పరీక్షలపై త్వ‌ర‌లో స్పష్టత! 

‣ ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల

 ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

‣ సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్‌ పోస్టులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.