• facebook
  • whatsapp
  • telegram

PRAYAAS: సామాజిక పరిశోధనల వేదిక ప్రయాస్‌  

* 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
 


పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారి సామాజిక పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయాస్‌-2023 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తోంది. విద్యార్థి దశలోనే శాస్త్రీయ విజ్ఞానంపై మక్కువ పెంచుకొని వారి సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఇది చక్కటి వేదిక. ఉత్తమ ప్రదర్శనలకు ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నారు.  ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 20వ తేదీలోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.


పోటీ అంశాలు ప్రధానంగా...

* స్థానిక సమస్యను గుర్తించి అధ్యయనం చేయడం

* స్థానిక సమస్య వెనక శాస్త్రీయ కారణాన్ని పరిశోధించడం

* ఏదైనా సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం

* శాస్త్రీయంగా రూపొందించడానికి ఉద్దేశించిన ఏదైనా ఆలోచన

రూ.50 వేల ప్రోత్సాహం

విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కారానికి శాస్త్రీయ పరిశోధన చేయాలి. తమ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సాయం కూడా తీసుకుని తగిన ఆలోచనలు పంచుకోవచ్చు. ఎంపికైన ప్రతిపాదనలకు రూ.50 వేల ప్రోత్సాహం అందించనున్నారు.

9 నుంచి ఇంటర్‌ విద్యార్థులు అర్హులు

పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 14-18 సంవత్సరాల వయసుండాలి. ప్రస్తుతం 9-11 వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్య పాఠశాలలకు చెందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఒకరు కాని ఇద్దరు కాని గ్రూపుగా ఏర్పడి తమ పరిశోధనను కొనసాగించవచ్చు. 9-12వ తరగతులకు బోధించే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితం, జీవశాస్త్రం బోధించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ గైడ్‌గా వ్యవహరించవచ్చు విద్యార్థులకు తమ ఆలోచనలు prayaasncert@gmail.com కు మెయిల్‌ చేయాలి.



  నోటిఫికేషన్‌   


   వెబ్‌సైట్‌    

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.