* హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద
నూజివీడు రూరల్, న్యూస్టుడే: 100, 99, 100, 100, 100, 100.. ఇవేంటని సందేహిస్తున్నారా? ఇవి పదో తరగతిలో ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద సాధించారు. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివారు. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్ కూడా ఎంతగానో పనికొచ్చిందని మనస్వీ తెలిపారు. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.