* పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు
ఈనాడు ప్రతిభ డెస్క్: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. ఎస్ఎస్సీ 2024-25 ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం మే 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి.. జులై- ఆగస్టు నెలలో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్), హవల్దార్(గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టులు భర్తీకానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. గతేడాది 1,558 ఖాళీలు భర్తీ అయిన విషయం తెలిసిందే. ఎంటీఎస్ ఖాళీలను సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా; హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.