‣ చెన్నైలో శిక్షణ పూర్తి చేసుకున్న అతివలు
పేదరికం, భర్తను కోల్పోయిన ఆవేదన ఇవేమీ.. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న వాళ్ల లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ నుంచి తాజాగా 197 మంది ఆర్మీ అధికారులు శిక్షణ పూర్తి చేసుకుంటే వీరిలో 36మంది మహిళలున్నారు. వారిలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్న ఇద్దరు మహిళామణుల స్ఫూర్తి కథలివి...
ఎన్సీసీ నుంచి ఆర్మీకి..

వీరుడి భార్యగా మిగిలిపోకుండా..
‘మేజర్ సుబ్రతో అధికారి’ దేశానికి అసమాన సేవలందించిన సైనికాధికారిగా పేరు తెచ్చుకున్నారు. 2022లో అరుణాచల్ప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయన భార్య దేబశ్రీబెనర్జీ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. భర్తలా తనూ సైన్యంలో చేరాలనుకున్నారు. ‘ఆయన నాతో తరచూ.. నువ్వూ ఆర్మీలో చేరొచ్చుగా అనేవారు. ఆ మాటలే నన్ను బతికించాయి. నేడిలా లెఫ్టినెంట్గా నిలబెట్టాయి. వీరుడి భార్యగానే మిగిలిపోకుండా. దేశం గర్వపడే వ్యక్తుల్లో ఒకరిగా మారాలని కసి, తపనతో శిక్షణ పూర్తిచేశా’ అంటూ కన్నీళ్లతో సమాధానం చెప్పారు దేబశ్రీ.
- హిదాయతుల్లాహ్.బి, చెన్నై
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ అకడమిక్ యాంగ్జైటీని అధిగమిద్దాం!
‣ కేంద్రంలో 307 ట్రాన్స్లేటర్ పోస్టులు
‣ ఇంటర్తో 7,547 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుళ్లు
‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్లు
‣ ‘పవర్ బీఐ’తో బెస్ట్ కెరియర్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.