* త్వరలో ప్రవేశాల షెడ్యూల్ వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. సోమవారం (ఏప్రిల్ 22) ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు డిగ్రీ ప్రవేశ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. గత ఏడాది మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 136 కలుపుకొని మొత్తం 1,054 కళాశాలలు దోస్త్ పరిధిలో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.