ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్ష (వీటీజీ సెట్ 2022) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాల కోసం మే 8న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు గురుకుల సొసైటీల వెబ్సైట్లు కానీ, 1800 425 45678 టోల్ఫ్రీ నంబరులో కానీ సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.