ఈనాడు, అమరావతి: ఏపీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో 45% సీట్లే భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ వివరాలను కన్వీనర్ నాగరాణి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 40,331 సీట్లు ఉండగా... 18,178 భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్లో 243 కళాశాలల్లో 38,332 సీట్లు ఉండగా.. 18,029 మంది ప్రవేశాలు పొందారు. ఫార్మసీలో 1,999 సీట్లు ఉండగా... 149 నిండాయి. క్రీడల కోటా 182, ఎన్సీసీ కేటగిరీ 361 సీట్లను రెండో విడత కౌన్సిలింగ్లో భర్తీ చేయనున్నారు. శాప్ నుంచి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున వీరికి సీట్లు కేటాయించలేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.