మేడ్చల్ కలెక్టరేట్, న్యూస్టుడే: వాయుసేన క్లరికల్ ఉద్యోగాల భర్తీ ర్యాలీని సెప్టెంబరు 15వ తేదీన నిర్వహిస్తున్నందున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. ఈ ర్యాలీ బేగంపేట ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్, ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరుగుతుందని పేర్కొన్నారు. భారతీయ వాయుసేనలో అగ్నిపథ్ స్కీంలో నేరుగా ఈ క్లరికల్ ఉద్యోగాల భర్తీకి కేవలం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు అర్హులని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు 4 ఏళ్ల అనంతరం 25 శాతం మందికి వాయుసేనలో ప్రేరణ కింద తిరిగి కొనసాగింపు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ htt://agnipathvayu.cdac.in/AV/ను చూడాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
ఐఐటీ-ధన్బాద్లో 71 ప్రొఫెసర్ ఖాళీలు
నిట్-రాయ్పుర్లో 23 ఫ్యాకల్టీ పోస్టులు
ఇండియన్ నేవీ-46 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలు
ఏఐఏఎస్ఎల్-998 హ్యండీమ్యాన్, ఏజెంట్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.