* సక్షమ్ అంగన్వాడీలుగా మార్పు
దిల్లీ: చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పోషణ్ భీ, పఢాయీ భీ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రెయినర్లు 11,412 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత వీరు దేశంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ ఆయా అంశాల్లో తర్ఫీదునిస్తారని మంత్రి పేర్కొన్నారు.