* ఏప్రిల్ 25 నుంచి మే రెండు వరకు పరీక్షలు
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: ఏప్రిల్ 25 నుంచి మే రెండు వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోకి చరవాణులను అనుమతించొద్దని, పరీక్ష రాసే వారితోపాటు ఇన్విజిలేటర్లు సైతం తీసుకెళ్లకుండా చూడాలన్నారు. పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఓపెన్స్కూల్ పదోతరగతి పరీక్ష కేంద్రాలు కరీంనగర్లో రెండు, హుజూరాబాద్లో ఒకటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు కేంద్రాల్లో 475 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇంటర్కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు కరీంనగర్లో మూడు, హుజూరాబాద్లో రెండు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 881 మంది పరీక్ష రాయనున్నారన్నారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని, వేసవికాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది మందులను అందుబాటులో ఉంచాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అజయ్యాదవ్, డీఆర్వో పవన్కుమార్, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డీఈసీ మెంబర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.