వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే: హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ శిక్షణ సంస్థలో 2024-25 విద్యా సంవత్సరానికి సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి శారద శుక్రవారం తెలిపారు. అనాథ, పాక్షిక అనాథ బాలికలు, సంరక్షణ కేంద్రాలు, మహిళా సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న బాలికలు మాత్రమే ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. పాలిటెక్నిక్ అర్హత పరీక్ష రాయకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందన్నారు. హనుమకొండలోని బాలరక్షా భవన్లో మే 17లోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు 97017 62709, 63025 44415 సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.