• facebook
  • whatsapp
  • telegram

Baseline Exam: బేస్‌లైన్‌ పరీక్షలో వింతలు

* 6-10 తరగతుల వరకు ఒకే నమూనా ప్రశ్నపత్రం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించిన బేస్‌లైన్‌ టెస్ట్‌ను ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంగ్ల భాషపై విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఆరు నుంచి పదో తరగతి వరకు ఒకే నమూనా ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు. ఆరో తరగతి విద్యార్థికి, పదో తరగతి విద్యార్థికి ఒకే రకమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. అధికారులు కనీసం ప్రశ్నాపత్రాన్ని పరిశీలించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) సిబ్బంది మొక్కుబడి తంతుగా దీన్ని నిర్వహించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ప్రశ్నపత్రం ఇస్తున్నామనే దాన్ని పట్టించుకోలేదు. ఆరో తరగతి విద్యార్థులకు విభక్తి (ప్రిపోజిషన్స్‌) లేకపోయినా దీనిపై ఆరు ప్రశ్నలు ఇచ్చారు. సిలబస్‌లో లేని ప్రశ్నలకు విద్యార్థులు ఎలా సమాధానాలు రాస్తారు? 6 - 10 తరగతులకు ఆంగ్ల భాష పరీక్ష నిర్వహణకు 10 ప్రశ్నపత్రాలు ఇచ్చారు. అన్నీ ఒకేలా ఉన్నాయి. ఐదో ప్రశ్నపత్రంలో వ్యతిరేక పదాల్లో పొడవు అనే పదం ఇవ్వాల్సి ఉండగా.. టోల్‌ అని ఇచ్చారు. కనీసం అక్షర దోషాలను పరిశీలించలేదు. ఇలాంటి ప్రశ్నపత్రంతో విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.