ఈనాడు డిజిటల్, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హుల నుంచి సాంఘిక సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. క్యూఎస్ ర్యాంకుల ప్రకారం ఉన్నతశ్రేణి 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులు అభ్యసించడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడును కలిగి ఉండాలని, ఎంబీబీఎస్ కోర్సులకు నీట్ పరీక్షలో అర్హత తప్పనిసరి అని ఒక ప్రకటనలో వెల్లడించింది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు, వయసు 35 ఏళ్లకు మించరాదని పేర్కొంది. ఆసక్తి గల విద్యార్థులు https://jnanabhumi.ap.gov.in/ సైట్లో సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మెరుగైన కొలువుకు మెడికల్ కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.