• facebook
  • whatsapp
  • telegram

Education: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తుల ఆహ్వానం

 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హుల నుంచి సాంఘిక సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. క్యూఎస్‌ ర్యాంకుల ప్రకారం ఉన్నతశ్రేణి 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులు అభ్యసించడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడును కలిగి ఉండాలని, ఎంబీబీఎస్‌ కోర్సులకు నీట్‌ పరీక్షలో అర్హత తప్పనిసరి అని ఒక ప్రకటనలో వెల్లడించింది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు, వయసు 35 ఏళ్లకు మించరాదని పేర్కొంది. ఆసక్తి గల విద్యార్థులు https://jnanabhumi.ap.gov.in/ సైట్‌లో సెప్టెంబర్‌ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెరుగైన కొలువుకు మెడికల్‌ కోడింగ్‌

‣ అవరోధాలు ఎదురైనా ఆపేదేలేదు!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.