ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు ఇంటర్మీడియట్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాదిలో కలిపి 45%, లేదా రెండో ఏడాదిలోనే 45% మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గ్రూపు సబ్జెక్టుల్లో 45% మార్కులు ఉన్నా అర్హులే. రిజర్వుడు అభ్యర్థులకు 40% మార్కులు సరిపోతాయి. కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. అందర్నీ ఉత్తీర్ణులు చేసి, కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. మార్కుల మెరుగుకు సప్లిమెంటరీ నిర్వహించినా కొందరు పరీక్షలు రాయలేదు. దీంతో చాలామందికి అర్హత మార్కులు తగ్గాయి. ఈ నేపథ్యంలో సడలింపులు ఇచ్చారు. మినహాయింపు ఈ ఒక్క ఏడాదికే వర్తిస్తుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.