ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం, ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు లభించనందున కౌన్సెలింగ్ వాయిదా పడింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్లకు గడువు సెప్టెంబరు 5తో ముగిసింది. ఇప్పటి వరకు లక్షమందికిపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు రెండు, మూడు రోజుల్లో సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేయనుంది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతుల ఉత్తర్వులు విడుదలైన తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ఐచ్ఛికాలకు అవకాశం కల్పిస్తారు.
‣ ఈఏపీసెట్లో ఎన్సీసీ, దివ్యాంగులు, సైనికోద్యోగులు, క్రీడల కోటా అభ్యర్థులకు సెప్టెంబరు 8న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రత్యేకంగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్లోని సహాయ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు
‣ అగ్రికల్చర్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.