జనరల్ కేటగిరీకి కటాఫ్ మార్కులు 55
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్లో ఈసారి కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన వారి శాతం గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గింది. గత ఏడాది(2021)లో 29.54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈసారి 26.17 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మొత్తం 1,55,538 మంది పరీక్ష రాయగా వారిలో 40,712 మందే పాస్ అయ్యారు. అదీ.. కటాఫ్ మార్కుల శాతం తగ్గించిన తర్వాత. గత ఏడాది వరకు పాస్ కావాలంటే జనరల్ కేటగిరీ విద్యార్థులకు మొత్తం మీద 17.5 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా.. ఈసారి దాన్ని 15.28కి తగ్గించడం(360కి 55 మార్కులు) గమనార్హం. కటాఫ్ మార్కులను ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 50, ఎస్సీ, ఎస్టీలకు 28 మార్కులుగా నిర్ణయించారు. ప్రశ్నపత్రాలు కఠినంగా ఉండటం వల్లే కటాఫ్ మార్కులను తగ్గించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రథమ ర్యాంకర్ అయిన ఆర్కే శిశిర్కు 360కి 314 మార్కులు మాత్రమే దక్కాయి. గతేడాది మొదటి ర్యాంకర్ మృదుల్ అగర్వాల్ 360కి 348 మార్కులు సాధించాడు. 2020లో ప్రథమ ర్యాంకర్ 396 మార్కులకు 352 పొందాడు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా
‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం
‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?
‣ స్టడీమెటీరియల్.. మాక్టెస్టులు.. లైవ్క్లాసులు ఉచితం!
‣ ఐఎన్సీఓఐఎస్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.