• facebook
  • whatsapp
  • telegram

AP NIT: ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు తొలగింపు

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి పేరిట సెప్టెంబ‌రు 23న‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో నిట్‌ డైరెక్టర్‌గా నియమితులైన సీఎస్పీ రావుపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై సీబీఐ, ఏసీబీ సంయుక్తంగా విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిట్‌ క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఆరోపణలు నిరూపితం కావడంతో అధికారులు రాష్ట్రపతికి నివేదించారు. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు నాగపుర్‌ విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డా.ప్రమోద్‌ మధుకర్‌ పడోలెను ఏపీ నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. సీఎస్పీ రావును తిరిగి వరంగల్‌ నిట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.