• facebook
  • whatsapp
  • telegram

German Versity MOU: జర్మన్‌ వర్సిటీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం

ఈనాడు, అమరావతి: జర్మనీలోని స్టెయిన్‌బీస్‌ విశ్వవిద్యాలయంలో ఏపీ విద్యార్థులు మాస్టర్స్‌ డిగ్రీ చదివేందుకు ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తరఫున ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందం చేసింది. కంప్యూటర్‌ సైన్సులో మాస్టర్‌ ఆఫ్‌ సైన్సెస్‌ను స్టెయిన్‌బీస్‌ అందిస్తుంది. విద్యార్థులను ఎంపిక చేసేందుకు జర్మనీ వర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాక్టికల్‌ లెర్నింగ్‌ కోసం ఈ కోర్సు ఉపయోగపడుతుందని వెల్లడించారు. స్టెయిన్‌బీస్‌ వర్సిటీ డైరెక్టర్‌ బెట్రామ్‌ లోహ్‌ముల్లర్‌ మాట్లాడుతూ.. బాష్‌ లాంటి కంపెనీలకు రాబోయే ఐదేళ్లల్లో ఐదు లక్షల మంది వరకు ఇంజినీర్లు అవసరమవుతారని తెలిపారు. హైడ్రోజన్‌ టెక్నాలజీపై జర్మనీ దృష్టిసారించిందని, దీనికి భవిష్యత్తులో 10వేల మంది వరకు ఇంజినీరింగ్‌ నిపుణులు అవసరమవుతారని, విద్యార్థులు పని చేస్తూ నేర్చుకోవచ్చని సూచించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.