ఈనాడు, అమరావతి: అధ్యాపకుల సామర్థ్యాలను పెంచేందుకు, కంటెంట్ తయారీ, ఉద్యోగాలకు విద్యార్థులను సంసిద్ధులను చేయడం, కెరీర్ మార్గదర్శకత్వం లాంటి వాటిల్లో లింక్డ్ఇన్ సహకారం కోరుతున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. లింక్డ్ఇన్ ఇండియా హెడ్ సాబా కరీమ్, సీనియర్ డైరెక్టర్ రుచి ఆనంద్, కస్టమర్ మేనేజర్ ఇషా గుప్తాలతో ఉన్నత విద్యామండలిలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో లింక్డ్ఇన్ సహాయంపై చర్చించారు. ఉన్నతవిద్యలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలుచేస్తున్న విధానాలను హేమచంద్రారెడ్డి వివరించారు. అక్టోబరు నుంచి 3.5లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రారంభించనున్నామని, అభ్యసన నిర్వహణ విధానం(ఎల్ఎంఎస్)లో 9లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారని ఆయన వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.